Advertisement

ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్ పంపిణీ మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది

AP Government Pension Distribution Guidelines: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్‌టిఆర్ భరోసా పథకంలో పెన్షన్ పంపిణీ ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. ఈ మార్పుల ద్వారా లబ్ధిదారులకు మరియు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఇబ్బందులను తగ్గించడం లక్ష్యం.

Advertisement

ఇప్పటి వరకు ఉదయం 4:00 లేదా 5:00 గంటల నుంచే పెన్షన్ పంపిణీ ప్రారంభం అవుతోంది. అయితే, ఇకపై పెన్షన్ పంపిణీ ప్రక్రియ ఉదయం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. దీనిని అమలు చేయడానికి పెన్షన్ పంపిణీకి ఉపయోగించే మొబైల్ అప్లికేషన్‌లో మార్పులు చేశారు. ఇది ఉదయం 7:00 గంటల తర్వాత మాత్రమే పనిచేస్తుంది.

Benefits of Eating Apple Everyday
ఆపిల్ తినడం వలన వచ్చే పరిణామాలు గురించి మీకు తెలుసా..?

కొత్త మార్గదర్శకాల ప్రకారం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు

  • లబ్ధిదారుల ఇళ్లకు 300 మీటర్లకు మించి పెన్షన్ పంపిణీ చేయాల్సి వస్తే, అందుకు గల కారణాన్ని వెంటనే సిస్టమ్‌లో నమోదు చేయాలి.
  • లబ్ధిదారులకు ఈ మార్పుల గురించి తెలియజేయడానికి ప్రభుత్వం ఒక 20 సెకన్ల ఆడియో సందేశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. పెన్షన్ పంపిణీ సమయంలో, లబ్ధిదారుల వివరాలు నమోదు చేసిన వెంటనే ఈ సందేశం ఆటోమేటిక్‌గా ప్లే అవుతుంది.

ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లో ప్రారంభం

ఈ కొత్త మార్గదర్శకాలను మార్చి 1న కర్నూలు మరియు చిత్తూరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ సమయంలో ఎంఎల్సీ ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుంది, కావున కొత్త విధానం మొదట ఈ రెండు జిల్లాల్లో అమలు చేయబడుతుంది. దీనికి విజయవంతమైన స్పందన లభిస్తే, ఈ పెన్షన్ పంపిణీ విధానం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.

ఈ నిర్ణయం ద్వారా సర్కారీ ఉద్యోగులు మరియు లబ్ధిదారులు రాత్రి వేళల్లో అనవసరంగా బయటకు రావాల్సిన పరిస్థితి తక్కువ అవుతుంది. కొత్త విధానం ద్వారా సిస్టమ్ మరింత పారదర్శకంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది

Tata Nano EV
Tata Nano EV మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది.? ధర కేవలం ₹1 లక్ష ధరకే లభించనుందా.?

Advertisement

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment